Road Accidents | భారీ వాహనాలతో రోడ్లపై మరణ మృదంగం!
ట్రక్కులు, లారీల వల్ల 2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలు
Telangana Road Accidents : ఇటీవల కర్నూలులో బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ వరుస ప్రమాదాలు తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక కుటుంబాలను సర్వనాశనం చేసిన చేవెళ్ల సంఘటన అందరినీ షాక్కు గురిచేసింది. చాలా వరకు ప్రమాదాల్లో భారీ వాహనాల కారణంగానే చోటుచేసకుంటున్నాయి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉంది.
2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలకు ట్రక్కులు, లారీలు కారణమయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జాతీయ డేటా చూపిస్తుంది. 2023లో మొత్తం మరణాలలో ట్రక్కులు, లారీల వల్ల జరిగిన ప్రమాదాలు 5.8 శాతంగా ఉన్నాయి.
ఈ ప్రమాదాల బారిన పడిన వారిలో...




