Sarkar Live

Author: Pramod Sarkar

ప్ర‌మోద్ స‌ర్కార్‌.. డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..
LifeStyle

Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..

Dairy Milk Price : దేశంలో జీఎస్టీ (GST) సంస్కరణల ప్రభావం పాల ఉత్పత్తులపై కూడా కనిపించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాలు, పాలు సంబంధిత ఉత్పత్తులపై పన్ను జీరోకి త‌గ్గించ‌డంతో వినియోగదారులకు ఉపశమనం లభించ‌నుంది. ముఖ్యంగా అమూల్ (Amul), మదర్ డైరీ (Mother Dairy) సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి. అమూల్ పాలు అమూల్ తాజా పౌచ్ పాలపై ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పౌచ్ పాలపై జీఎస్టీ 0 శాతం ఉండటంతో ధరలు అలాగే కొనసాగుతాయి. అయితే అమూల్ టెట్రా ప్యాక్ (UHT milk) పాల ధర మాత్రం తగ్గనుంది. UHT పాలు ఎక్కువ రోజులు ఫ్రిజ్ అవసరం లేకుండా నిల్వ ఉండే ప్రత్యేకత కలిగి ఉంటాయి. మదర్ డెయిరీ పాల ధర లీటరుకు 3 నుండి 4 రూపాయలు తగ్గవచ్చు. అమూల్ టెట్రా ప్యాకెట్ పాల ధర మాత్రమే తగ్గుతుంది. UHT పాలను మీరు చాలా నెలలు ఫ్రిజ్‌లో ఉంచకుండానే ఉపయోగించవచ్చు. UHT ప్రక్రియలో, పాలను కనీసం 135 డిగ్రీల సెల్సియస్‌కు ...
Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
Crime, warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అత‌డు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మ‌ద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను త‌ర‌చూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పడంతో వీరి మ‌ధ్య గొడవలు పెరిగాయి. ఈ క్ర‌మంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్క‌సారిగా దాడి చేయడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line
AndhraPradesh

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line

కోల్‌కతా–చెన్నై మధ్య కొత్త ప్రత్యామ్నాయ మార్గం విజయవాడ మార్గంలో తగ్గనున్న ప్రయాణికుల రద్దీ, జర్నీ టైం తీరప్రాంత రైల్వే కారిడార్‌లో కీలక లింక్ మచిలీపట్నం–తిరుపతి రైలు సేవలపై డిమాండ్ విజయవాడ : కృష్ణా జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ (Machilipatnam Repalle Railway Line) పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయి ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. మచిలీపట్నం-రేపల్లె లైన్ ఎందుకు కీలకమైనది మచిలీపట్నం-రేపల్లె లైన్ (Machilipatnam Repalle Railway Line) ప్రాముఖ్యత గురించి బాలశౌరి చర్చించారు. కోల్‌కతా ‌‌– చెన్నై మధ్య ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా విజయవాడ జంక్షన్‌లో రద్దీని తగ్గుతుందని, దాదాపు 70 కి.మీ...
ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి
Hyderabad, Crime

ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

ACB Trap in Narsangi : హైదరాబాద్‌: నార్సింగి మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్‌ అనే వ్యక్తిని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangan...
SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?
National

SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?

New Delhi : ఓటర్ల జాబితా సవరణ (SIR) గురించి బ్రేకింగ్ న్యూస్ వ‌స్తున్నాయి.. కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 10న దిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో, బీహార్ తర్వాత దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో SIR నిర్వహించడం గురించి చర్చ ఉంటుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారికంగా దీని గురించి తన ఉద్దేశాన్ని ప్ర‌క‌టించింది. బీహార్‌లో జరుగుతున్న SIR (Special Intensive Revision) గురించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కూడా కమిషన్ దీని గురించి సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 10న దిల్లీలో కీల‌క‌ సమావేశం టైమ్స్ నౌ నవభారత్ కు అందిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశం సెప్టెంబర్ 10న ఢిల్లీలోని ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో జరుగుతుంది. ...
error: Content is protected !!