సాయి క్రిష్ణ ధాన్యం లీలలు.. రికార్డుల్లో నిల్వ.. మిల్లులో ఖాళీ!
పౌరసరఫరాల రికార్డులకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ తేడా?
Sai Krishna Rice Mill Grain Scam | పౌరసరఫరాల శాఖ రికార్డుల్లో వందల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నా, మిల్లులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా నందనంలోని సాయి కృష్ణ రైస్ మిల్లుపై ఇప్పుడు అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రికార్డుల్లో ‘నిల్వ’… మిల్లులో ‘ఖాళీ’!
పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 15 ఏసికేలు (ACKs) ఇప్పటికీ పెండింగ్లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధాన్యం నిల్వలు మిల్లుకు రాకుండానే రికార్డులు సృష్టించారా? లేదా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అక్రమ మార్గాల...




