Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
కెసిఆర్ కు డాటర్ స్ట్రోక్.. – Kavitha controversy
Special Stories

కెసిఆర్ కు డాటర్ స్ట్రోక్.. – Kavitha controversy

కవిత ఎపిసోడ్ తో బిఆర్ఎస్ కు భారీ నష్టం.. Telangana Politics 2025 : రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. కేసీఆర్(KCR).. తనదైన వ్యూహాలు, రాజకీయ చ‌తుర‌త‌తో మహామహులకు ముచ్చెమటలు పట్టించిన రాజ‌కీయ ఉద్ధండుడైన ఆయ‌న ప‌దేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా తెలంగాణ‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో పాల‌న కొన‌సాగిస్తూనే రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే ఇప్పుడు సొంత కూతురు క‌ల్వ‌కుంట్ల‌ కవిత ఎపిసోడ్ (Kavitha Controversy) కారణంగా కేసీఆర్‌ గట్టి దెబ్బ తిన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ఇది ఊహించని షాక్ గా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికీ కోలుకోలేక, పార్టీని మళ్లీ అధికారంలోకి ఎలా తీసుకురావాలో తెలియక మల్లగుల్ల...
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025
Hyderabad, State

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025

PCC Appointments 2025 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) కార్యవర్గాన్ని अखిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు నియమితులయ్యారు. ఈ ఎంపికల్లో సామాజిక న్యాయం, పార్టీ పట్ల విధేయత, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియామకాల (PCC Appointments 2025 ) ద్వారా కాంగ్రెస్ పార్టీ యువత, సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ వచ్చే ఎన్నికల దృష్టితో బలమైన టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. క్షేత్రస్థాయిలో సేవలందించిన నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, కొత్త తరానికి ప్రాధాన్యం కల్పిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నియామకాలు జరిగాయి. PCC Appointments 2025 : ముఖ్య నేతలకు కీలక పదవులు ఎంపీ నక్కా రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ నుండి కాంగ...
Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి
Crime, National

Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి

Mumbra Railway Station Accident : థానే(Thane) లోని ముంబ్రా రైల్వే స్టేషన్‌లో ఘోర ప్ర‌మాదం (Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి) చోటుచేసుకుంది. CSMT నుండి లక్నో వెళ్తున్న రైలు నుంచి సుమారు 10 నుండి 12 మంది ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోయారు. ప్రమాదానికి కారణం రైలులో జనసమూహం ఎక్కువగా ఉండడ‌మేన‌ని భావిస్తున్నారు. ప్రయాణీకులు తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఇదే సమయంలో ప‌లువురు ప్ర‌యాణికులు ప‌ట్టుత‌ప్పి జారి కింద‌ప‌డిపోయార‌ని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. సోమవారం, ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద లక్నో (Mumbai To Lucknow) కు వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ (Pushpak Express) (12534) రైలు నుండి అనేక మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైలులో ప్ర‌యాణికులు కిక్కిరిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగ...
Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..
Crime

Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..

Chhattisgarh Maoist Attack | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో మావోయిస్టులు మ‌రో ఘాతుకానికి పాల్ప‌డ్డారు. దోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీ (IED Blast)తో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్‌ రావు గిరిపుంజే (Akash Rao Giripunje) ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది పోలీసు అధికారులు, సిబ్బంది గాయపడ్డారని ఐజి బస్తర్ పి. సుందర్‌రాజ్ ధృవీకరించారు. “ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కొంటా ఆసుపత్రికి తరలిస్తుంగా ఆయ‌న మృతిచెందారు. గాయపడిన ఇతర సిబ్బంది పరిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఐజి తెలిపారు. IED పేలుడులో కొంటా SDPO, స్థానిక స్టేషన్ ఇన్‌ఛార్జ్ కూడా గాయపడ్డారు, వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ సంఘటన తర్వాత, ఛత్తీస్‌గఢ్ పోలీసుల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ASP గిర్పుంజే బలిదానం ఆ దళానికి తీవ్ర నష...
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
error: Content is protected !!