Sarkar Live

Special Stories

Special Stories

సదా… ఆనందంగా.. ప్రభుత్వ భూమిని మింగిన సర్వేయర్
Special Stories

సదా… ఆనందంగా.. ప్రభుత్వ భూమిని మింగిన సర్వేయర్

Surveyor Land Scam : విధులకు పంగనామం.. రియల్ ఎస్టేట్‌కు జై! కంచే చేను మేసిన చందంగా.. భూములను కొలవాల్సిన సర్వేయర్ ఏకంగా ప్రభుత్వ భూమినే స్వాహా చేసేశారు. సామాన్య ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, నేడు కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక ప్రభుత్వ సర్వేయర్ నిర్వాకం (Surveyor Land Scam) సొంత గ్రామంతోపాటు ఆయనతో కలిసి చదువుకున్న దోస్తుల్లో కూడా చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వేయర్ గా ఉంటూ వెంచర్ ల దందా కొనసాగిస్తున్న సదరు సర్వేయర్ అంశం ఇప్పుడు వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ​సొంత గ్రామంలోనే ‘ప్లాట్ల’ పర్వం ​సదరు సర్వేయర్ తన సొంత గ్రామమైన శాయంపేట హావేలి లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని యధేచ్ఛగా ప్లాట్లు చేసి బందువులకే విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడంలో తనకున్న పట్టును ఉపయోగించుకుని, సర్కారు భూమి...
POCSO కేసు V/S హానీ ట్రాప్
Special Stories

POCSO కేసు V/S హానీ ట్రాప్

17 ఏళ్ల అమ్మాయితో తిరగడం చట్టరీత్యా నేరమని బండి సంజయ్ కొడుకుకు తెలియదా 17 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకున్నాడని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తల్లిదండ్రులు 5 కోట్లు డిమాండ్ చేశారంటూ బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath POCSO Case) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. మైనర్ బాలికతో సాగించిన వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా కాకుండా, రాజకీయ మరియు న్యాయపరమైన పెను తుఫానుగా మారింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ​ అసలు ఏం జరుగుతోంది? POCSO V/S హానీ ట్రాప్! ​ఈ కేసులో రెండు భిన్నమైన వాదనలు తెరపైకి రావడం సంచలనం కలిగిస్తోంది. ​బాధితుల వాదన: తమ 17 ఏళ్ల కుమార్తెను భగీరథ్ మాయమాటలతో నమ...
కోట్లకు పడగలెత్తిన సర్వేయర్
Special Stories

కోట్లకు పడగలెత్తిన సర్వేయర్

​టెక్స్‌టైల్ పార్క్ కేంద్రంగా కోట్ల దందా.. ప్రభుత్వ సర్వేయర్ ‘గాలి’ వేగం! సదా.. ఆనందంగా అక్రమాల పర్వం రియల్టర్ అవతారమెత్తిన ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీ నజర్ వేస్తే విస్తుపోయే అక్రమాస్తులు వెలుగులోకి ​Warangal Textile Park Surveyor Scam | అతను ఒక ప్రభుత్వ సర్వేయర్. భూముల హద్దులు నిర్ణయించడమే అతని విధి. కానీ, ఆ హద్దులు దాటి అక్రమ సంపాదనలో ‘కోట్లకు పడగలెత్తాడు’. ప్రభుత్వ ఉద్యోగి ముసుగులో రియల్టర్ అవతారమెత్తి, సామాన్యుల భూములతో చెలగాటమాడుతూ అపర కుబేరుడిగా అవతరించాడు. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఈ 'రియల్' సర్వేయర్ లీలలు హాట్ టాపిక్‌గా మారాయి. ​టెక్స్‌టైల్ పార్క్.. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్! ​మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటును ఆసరాగా చేసుకున్న ఈ సర్వేయర్, అక్కడ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని 'గాలి'లా విస్తరించాడు. ప్రభుత్వ సమాచారం ముందే తెలుసుకుంటూ, అమాయక రైతులను బురిడీ కొట్టిస్తూ భూదంద...
సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!
Special Stories

సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!

Civil Supplies Nepotism Telangana | ​అర్హత ప్రాతిపదికన దక్కాల్సిన ఉద్యోగం అది.. కానీ అక్కడ ‘అర్హత’ కంటే ‘అండదండలకే’ పీట వేశారు. నిబంధనల ప్రకారం ఆ సీటులో కూర్చోవడానికి సదరు ఉద్యోగికి ఏమాత్రం అర్హత లేకపోయినా, చక్రం తిప్పిన ఓ ‘పెద్ద సారు’ పుణ్యమా అని దర్జాగా గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సివిల్ సప్లై శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ​ఎర్రమంజిల్ నుంచే అసలు కథ! ​ఈ వ్యవహారానికి ప్రధాన కేంద్రం ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లై ప్రధాన కార్యాలయం. అక్కడ కీలక బాధ్యతల్లో ఉన్న ఒక ఉన్నతాధికారికి సదరు ఉద్యోగికి అత్యంత సన్నిహిత బంధువు కావడమే ఇందుకు కారణం. ఆ బంధుత్వమే ఇప్పుడు నిబంధనలకు తూట్లు పొడిచేలా చేసింది. తను కోరుకున్న చోట, కోరుకున్న రీతిలో చక్రం తిప్పేందుకు ఎర్రమంజిల్ నుంచే పావులు కదిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ​నోరు మెదపని జిల్లా మేనేజర్ (DM) ​నిజానికి అర్హత లేని వ్యక్తి కీలక స్థ...
Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!
Special Stories

Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!

​Vanjarapalli Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా, సంగెం మండలం వంజరపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ ఎత్తున ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేస్తే మిల్లర్ భాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. ​నిల్వల్లో భారీ తేడాలు ​ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసేందుకు, సివిల్ సప్లై ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా పోయింది. అధికారులు కనుక రాజరాజేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే(ఫిజికల్ వెరిఫికేషన్) రికార్డుల్లో ఉండే నిల్వలకు మిల్లులో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. ​అక్రమాల తీరు ఇలా.. ప్రభుత్...
error: Content is protected !!