Sarkar Live

Special Stories

Special Stories

నా మిల్లు.. నా ఇష్టం! ఫున్నెల్‌లో సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ధాన్యం’ దందా? – Rice Mill Scam
Special Stories

నా మిల్లు.. నా ఇష్టం! ఫున్నెల్‌లో సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ధాన్యం’ దందా? – Rice Mill Scam

2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి భారీగా ధాన్యం గోల్ మాల్ సుమారు 10 ఏసికేలకు పైగా ప్రభుత్వ వడ్లు గల్లంతైనట్లు ఆరోపణలు Punnel Village Rice Mill Fraud : ​"నిబంధనలు నాకు వర్తించవు.. నా ఇష్టారాజ్యమే ఇక్కడ శాసనం" అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఫున్నేల్‌లోని సత్యనారాయణ స్వామి రైస్ మిల్లు యజమాని. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వ ధాన్యం సేకరణలో భారీ గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ ప్రభుత్వానికి చెందిన వడ్లు మాయమవ్వడం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది. ​ఏకంగా 10 ఏసీకేలకు పైగా (ACKs) వడ్లు గల్లంతు! ​ప్రభుత్వ లెక్కల ప్రకారం సివిల్ సప్లైస్ విభాగం నుంచి మిల్లుకు అప్పగించిన ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 10 ఏసీకేలకు (Ack) సంబంధించిన వడ్లు మిల్లు నుండి 'మాయం' అయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ మార్కెట్ ధర ప్రకారం కోటికి...
Rice Mill Scam | వెంకటేశ్వరా…ధాన్యం ఎక్కడా?
Special Stories

Rice Mill Scam | వెంకటేశ్వరా…ధాన్యం ఎక్కడా?

గాంధీనగర్ (మాణిక్యాపూర్ )లో రూ 2 కోట్ల ధాన్యం గల్లంతైనట్లు ఆరోపణలు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే డి సి ఎస్ ఓ సైతం విస్తుపోవాల్సిందే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్(మాణిక్యాపూర్)లో మిల్లర్ ఇష్టారాజ్యం Rice Mill Scam in Bheemadevarapalli | హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ (మాణిక్యాపూర్) గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో 2025-26 ఖరీఫ్ సీజన్ భారీస్థాయిలో ధాన్యం గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం మిల్లు నుండి మాయమైనట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ​అసలేం జరిగింది? ​ప్రభుత్వం నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, సదరు మిల్లర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులు అ...
Cold Storage Scam | కోల్డ్ స్టోరేజ్ ముసుగులో ‘కోట్ల’ దందా: నకిలీ రైతుల పేర్లతో బ్యాంకులకు కన్నం!
Special Stories

Cold Storage Scam | కోల్డ్ స్టోరేజ్ ముసుగులో ‘కోట్ల’ దందా: నకిలీ రైతుల పేర్లతో బ్యాంకులకు కన్నం!

కోల్డ్ స్టోరేజ్ యజమానుల చీటింగ్ నకిలీ రైతుల పేర్లతో ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు.. కోల్డ్ స్టోరేజ్ లలో స్టాక్ పెట్టినట్లు రికార్డులు సృష్టించి( నకిలీ రైతులను) బ్యాంకులను మోసం చేస్తున్న వైనం వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాల భాగోతం Cold Storage Scam in warangal | అన్నదాతలకు అండగా ఉండాల్సిన కోల్డ్ స్టోరేజ్ (శీతల గిడ్డంగి) కేంద్రాలు కొందరు యజమానుల స్వార్థంతో అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.నకిలీ రైతులను సృష్టించి( పేర్లను వాడుకుంటూ), ప్రైవేట్ బ్యాంకు అధికారులతో చేతులు కలిపి కోట్లాది రూపాయల మేర బ్యాంకు రుణాలను కొల్లగొడుతున్న వైనం వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. ​అక్రమ నెట్‌వర్క్.. అసలు కథ ఇదే! ​సాధారణంగా రైతులు పండించిన పంటను కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచినప్పుడు, ఆ నిల్వలపై బ్యాంకులు 'అగ్రికల్చర్ లోన్' (పంట తాకట్టు రుణం) మంజూరు చేస్తా...
TRS Party | తెలంగాణ లో ‘కవిత’పార్టీకి స్పేస్ ఉంటుందా?
Special Stories

TRS Party | తెలంగాణ లో ‘కవిత’పార్టీకి స్పేస్ ఉంటుందా?

​తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధానికి తెరలేచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రక్షణ సేన' (Kalvakuntla Kavitha TRS Party) పేరుతో కొత్త పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. తండ్రి స్థాపించిన నాటి 'తెలంగాణ రాష్ట్ర సమితి'ని గుర్తుచేసేలా ఈ పేరు ఉండటం, పసుపు-ఆకుపచ్చ-నీలం రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించడం ద్వారా ఆమె తన స్పష్టమైన ఉద్దేశాలను చాటారు. అయితే, ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలతో నిండిపోయిన తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఈ 'TRS'కు స్థానం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ​త్రిముఖ పోరులో నాల్గవ పార్టీ నిలదొక్కుకునేనా? ​ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఇలా ఉన్నాయి.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికలల్లో గెలిచి జోరు మీదుంది.పలురకాల సంక్షేమ పథకాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ...
ధాన్యం కొనుగోళ్లలో ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానం రద్దు – Online Truck Sheet Cancelled
Special Stories

ధాన్యం కొనుగోళ్లలో ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానం రద్దు – Online Truck Sheet Cancelled

సర్కార్ లైవ్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు ​Online Truck Sheet Cancelled | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా రైతులు, ఐకేపీ (IKP) కేంద్రాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వివాదాస్పదంగా మారిన ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేసింది. ఇకపై ధాన్యం సేకరణ పాత పద్ధతిలోనే కొనసాగనుంది. "​సర్కార్ లైవ్" కథనాలకు స్పందించిన ప్రభుత్వం ​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆన్‌లైన్ ట్రక్ షీట్ల వల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, సర్వర్ల మొరాయింపు, తద్వారా లారీల రాకపోకల్లో జరుగుతున్న జాప్యంపై ‘సర్కార్ లైవ్’ (Sarkar Live) వంటి వార్తా సంస్థలు వరుస కథనాలను వెలువరించింది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న అగచాట్లు, వర్షాల భయంతో ఆందోళన చెందుతున్న...
error: Content is protected !!