Sarkar Live

State

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?
State, warangal

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?

నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం Warangal | వ‌రంగ‌ల్ 15వ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంస‌మై నెల‌లు గ‌డుస్తున్నా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. లోతైన గుంత‌లు ప‌డి రాళ్లు బుర‌ద‌తో నిండిపోయి ఉండ‌డంతో ఎప్పుడు ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 25 స్కూల్ బ‌స్సులు విద్యార్థుల‌తో నిత్యం రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. కీర్తిన‌గ‌ర్, గొర్రెకుంట, లేబ‌ర్ కాల‌నీ ప్రాంతాల నుంచి ప‌లువురు త‌మ పిల్ల‌ల‌ను ద్విచ‌క్ర‌వాహనాల‌పై పిల్ల‌ల‌ను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు. భారీ వాహ‌నాల‌తో నిత్యం రద్దీ.. అలాగే ప‌త్తి, మిర్చి, ఇత‌ర వ్య‌...
KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష
State

KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష

కాంగ్రెస్‌ రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చింది: మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో అధికార‌ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్‌గా పేరుగాంచిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞత, తెలివితేటలకు ఈ ఎన్నిక కఠిన పరీక్షగా నిలుస్తుందని అన్నారు. విజ్ఞులైన ఓటర్లు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్‌ పార్టీకి గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని అన్నారు. “కాంగ్రెస్ దుష్టపాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంద...
Government Jobs | రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు
State, Hyderabad

Government Jobs | రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు

Hyderabad | పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-2 నియామకాలలో ఎంపికై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో 14 మంది కొత్త‌గా సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమితుల‌య్యారు. వీరంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని (Ponguleti Srinivas Reddy) సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రి అభినందించి ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌ బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ . స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయతీ, నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడిరపజేయాలని ఉద్బోధించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు (Government Jobs) లభిస్తున్నాయని అన్నారు. ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరక...
Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, warangal

Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Forecast | వ‌రంగ‌ల్ : తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర‌నున్నాయ‌ని పేర్కొంటూఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఆదివారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, మానుకోట‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పాల‌మూరు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ...
Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..
State, warangal

Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..

Warangal Mamnoor Airport | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమానంగా, ఆధునిక సదుపాయాలతో వరంగల్ సమీపంలోని మామునూర్ వద్ద కొత్త‌ విమానాశ్రయ నిర్మాణం (Mamnoor Airport) జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా రూ.90 కోట్ల నిధుల‌ను అదనంగా మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లుచ‌ భవనాల (విమానాశ్రయాలు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు న‌ష్ట‌పరిహారం గతంలోనే ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కొత్తగా విడుదలైన నిధులతో కలిపి భూసేకరణ కోసం మొత్తం 295 కోట్లను కేటాయింట్లు అయింది. భూములను కోల్పోతున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం చెల్లించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఈ నిధులు బదిలీ చేయనున్నట్టు తెలుస్...
error: Content is protected !!