Warangal | ప్రమాదం జరిగితే గానీ స్పందించరా?
                    నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు
స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం
Warangal | వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమై నెలలు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. లోతైన గుంతలు పడి రాళ్లు బురదతో నిండిపోయి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 25 స్కూల్ బస్సులు విద్యార్థులతో నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. కీర్తినగర్, గొర్రెకుంట, లేబర్ కాలనీ ప్రాంతాల నుంచి పలువురు తమ పిల్లలను ద్విచక్రవాహనాలపై పిల్లలను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు.
భారీ వాహనాలతో నిత్యం రద్దీ..
అలాగే పత్తి, మిర్చి, ఇతర వ్య...                
                
             
								



