Sarkar Live

State

Seasonal Diseases | తెలంగాణలో రికార్డు స్థాయిలో సీజనల్ వ్యాధులు..
State

Seasonal Diseases | తెలంగాణలో రికార్డు స్థాయిలో సీజనల్ వ్యాధులు..

Seasonal Diseases | సీజనల్ వ్యాధుల వ్యాప్తి పరంగా, 2024లో తెలంగాణ అత్యంత దారుణమైన సంవత్సరంగా రికార్డుల‌కెక్కింది. గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని స్థాయిలో డెంగ్యూ పాజిటివ్ కేసులు, అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) వద్ద అందుబాటులో ఉన్న సీజనల్ వ్యాధుల డేటా ఆధారంగా, మొదటిసారిగా, తెలంగాణలో మొత్తం 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు, 10,077 డెంగ్యూ ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదవడం చాలా ఆందోళన కలిగించే విషయం. కీళ్లను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ వైరస్ వ్యాధి, ప్రతి సంవత్సరం జూన్ నుండి డిసెంబర్ వరకు డెంగ్యూకు రెండవ స్థానంలో ఉంటుంది. తెలంగాణలో అనుమానిత చికున్‌గున్యా కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదవడం ఇదే మొదటిసారి. 2018 నుంచి 2024 మధ్య, 2022లో ఒక్కసారి మాత...
Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా
State

Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా

Hydra : హైడ్రా మరోమారు తన పవర్ చూపించింది. ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా స్థలాల్లో హెచ్చరిక బోర్డులను కూడా హైడ్రా పాతింది. Hydra Action : వసంత ప్రాజెక్టు స్థలం స్వాధీనం హైదరాబాద్ హఫీజ్ పేటలో గల 17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతొ అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను బల్డోజర్ తో తొలగించి బోర్డు పెట్టారు. ఈ 17 ఎకరాల భూమి విలువ సుమారు 2 వేల కోట్లకుపైగా ఉటుందని తెలుస్తోంది. అయితే 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని, ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. హైడ్రా ...
Mangalagiri AIIMS | వైద్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
State

Mangalagiri AIIMS | వైద్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Mangalagiri AIIMS : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంగ‌ళగిరి(Mangalagiri)లోని ఎయిమ్స్‌ (All India Institute of Medical Sciences (AIIMS) ఆస్ప‌త్రి అభివృద్ధికి కేంద్రం (Central Government) ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంది. ప్రత్యేకంగా ఈ హాస్పిటల్‌ వృద్ధికి, అవసరమైన శాశ్వత సిబ్బందిని నియమించేందుకు (appointment of permanent staff members) కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekha) చర్యలు చేప‌ట్టారు. గతంలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ సమర్థంగా పని చేయడానికి అవసరమైన శాశ్వత ఉద్యోగాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని పరిష్కారం కోసం కేంద్ర స్థాయిలో చొరవ తీసుకుంటోంది. శాశ్వ‌త‌ సిబ్బంది లేక ఇబ్బందులు Mangalagiri AIIMS ఆస్ప‌త్రి అనేది అత్యాధునిక వైద్య సేవల ప్రాధాన్యతను కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ (central government healthcar...
CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..
State, Hyderabad

CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..

CM Revanth Japan tour : జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఇండియా హౌస్‌లో తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి (Telangana Chief Minister A. Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) పేరుతో రేవంత్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందం ప్రస్తుతం జపాన్ పర్యటనలో (Japan tour) ఉంది. ఈ సందర్భంగా జపాన్‌లో రేవంత్‌కు భారత రాయబారి శిభూ జార్జ్ స్వాగ‌తం ప‌లికారు. ఇండియా హౌస్‌లో ప్రత్యేక భోజ‌నాలు ఏర్పాటు చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ డిప్లొమాటిక్ నివాసంలో జరిగిన ఈ వేడుక భారతదేశం, జపాన్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబింగా నిలిచింది. CM Revanth Japan tour : పరస్పర సంబంధాలు బలపడే చర్చలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాజకీయ రంగంలోని ప్రముఖులు (Indian political leaders) హాజరయ్యారు. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి,...
IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
State

IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

IMD Report | తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ ప్రకారం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశముంది? గురు, శుక్రవారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్ల...
error: Content is protected !!