Sarkar Live

State

Liquor Sales Record | తెలంగాణలో మద్యం అమ్మకాల ఆల్‌టైమ్ రికార్డు
Hyderabad

Liquor Sales Record | తెలంగాణలో మద్యం అమ్మకాల ఆల్‌టైమ్ రికార్డు

డిసెంబర్‌లో రూ. 5,102 కోట్ల విక్రయాలు.. న్యూ ఇయర్ కిక్కు మామూలుగా లేదు! హైదరాబాద్, జనవరి 1: తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించాయి. 2025 డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales Record) సరికొత్త రికార్డును సృష్టించాయి. కేవలం డిసెంబర్ నెలలోనే రూ. 5,102 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఒకే నెలలో ఇంత భారీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల్లో రూ. 750 కోట్లు! న్యూ ఇయర్ జోష్‌లో భాగంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం విక్రయాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిసెంబర్ 30: ఒక్కరోజే రూ. 375 కోట్ల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31 సాయంత్రానికే అమ్మకాలు రూ. 350 కోట్లు దాటగా, అర్థరాత్రి వరకు జరిగిన అమ్మకాలతో కలిపి ఈ రెండు రోజుల్లోనే సుమారు రూ. 750 కోట్లకు పై...
అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి – Assembly Winter Sessions
State, Hyderabad

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి – Assembly Winter Sessions

ప్రారంభమైన శాసనసభ సమావేశాలు.. సంతాప తీర్మానాల అనంతరం వాయిదా ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి సభకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేల ఘన స్వాగతం జనవరి 2 వరకు అసెంబ్లీ వాయిదా.. మాజీ సర్పంచుల ముట్టడితో ఉద్రిక్తత Telangana Assembly Winter Sessions : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ఆకర్షణగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) చాలా కాలం తర్వాత సభకు హాజరుకావడం నిలిచింది. సభ ప్రారంభం కావడానికి ముందే కేసీఆర్ తన సీటులో వచ్చి కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి రాగానే నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. మర్యాదపూర్వకంగా నమస్కరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రు...
Journalist | జర్నలిస్టుల ‘అక్రిడిటేషన్’ జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!
State, warangal

Journalist | జర్నలిస్టుల ‘అక్రిడిటేషన్’ జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!

జి.ఓ నంబర్ 252ను వెంటనే సవరించాలి రెండు కార్డుల విధానం వద్దు.. 10 వేల కార్డుల కోతపై ఆగ్రహం డెస్క్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానళ్లకు అన్యాయం హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జి.ఓ నంబర్ 252 తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోతున్నారని TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ధ్వజమెత్తింది. ఈ అనాలోచిత జీవోను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు యూనియన్ ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కోశాధికారి పి.యోగనంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐజేయు నేత అవ్వారి భాస్కర్ తదితరులు మాట్లాడారు. జీవోలోని ప్రధాన లోపాలు - TUWJ అభ్యంతరాలు:...
KTR : కాంగ్రెస్‌ది పక్కా మాఫియా పాలన
State, Hyderabad

KTR : కాంగ్రెస్‌ది పక్కా మాఫియా పాలన

ఇసుక మాఫియా కోసం చెక్‌డ్యామ్‌లపై డైనమైట్లు – ప్రభుత్వ కనుసన్నల్లోనే విధ్వంసం హైదరాబాద్‌ : తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు, పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక మాఫియా లాభాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత ‘వాటర్‌మ్యాన్’ రాజేంద్ర సింగ్ దీనిని మానవ నిర్మిత విధ్వంసంగా పేర్కొన్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదని విమర్శించారు. డ్రిల్లింగ్ మెషీన్లతో రంధ్రాలు చేసి, జెలటిన్ స్టిక్స్‌తో పేల్చినట్లు సాక్ష్యాలతో నిరూపించారని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే, వాటిని కూల్చి రైతుల పొలాలను ఎడారులుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం కాదని, గ్యాంగ్‌స్టర్ల అడ్డా అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యం వల...
Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్
State, Hyderabad

Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్

ఆస్తి పన్ను (Property Tax) వడ్డీపై 90 శాతం రాయితీ! హైదరాబాద్, డిసెంబర్ 22: చాలా కాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించాయి. బకాయిలపై పేరుకుపోయిన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు 'వన్‌ టైమ్‌ సెటిల్మెంట్' పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం ముఖ్యాంశాలు:90% వడ్డీ మాఫీ: పన్ను చెల్లింపుదారులు తమ అసలు పన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేస్తుంది. ఎవరికి వర్తిస్తుంది?: ఈ రాయితీ కేవలం ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన 20 మున్సిపాలిటీలు,...
error: Content is protected !!