Sarkar Live

State

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card
State, Sangareddy

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card

ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల స‌ర్కార్ లైవ్, సిద్ధిపేట‌ : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాల‌ని...
State, Hyderabad

స్థానిక ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివ‌రాలు ఇవే.. ఎలక్షన్స్ – Local Body Elections

Local Body Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Gram Panchayat Elections 2025) అంతా సిద్ధ‌మైంది. అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొద‌ట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్‌ ఎన్నికలను మూడు దశల్లో జరిపించ‌నున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను సోమ‌వారం ప్రకటించారు. అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడుత పోలింగ్‌, అదే నెల 27న రెండో విడుత పోలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. అక్టోబర్‌ 17న సర్పంచ్‌ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్‌ విడుదల చేయ‌నున్నారు. అక్టోబర్‌ 31న సర్పంచ్‌ ఎన్నికల తొలి విడుత పోలింగ...
హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway
State, AndhraPradesh

హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway

Hyderabad Vijayawada expressway | హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. జాతీయ రహదారి (NH65)ని 8 లేన్‌లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. ప్రతి రోజు భారీ ట్రాఫిక్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఇరురాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు ఇది భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో 17 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ఫ్లైఓవర్లు కూడా నిర్మించ‌నున్న‌ట్లు మంత్రి కోమ‌టిరెడ్డి వెల్లడించారు. ఇటీవల దిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి తెలిపారు. కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ నుండి విజయవాడకుకొత్త రహదారి పూర్తయిన తర్...
రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025
Hyderabad

రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025

Hyderabad floods 2025 : కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు,వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్న‌ తెలంగాణ‌కు ఐఎండీ మ‌రోమారు వాతావ‌ర‌ణ‌ హెచ్చ‌రిక‌ జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్‌ ఒకటి నాటికి ఉత్తర, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ప...
IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం
State

IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం

IAS transfers : తెలంగాణ (Telangana) ప్రభుత్వంలో ముఖ్యమైన పరిపాలనా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ప్ర‌భుత్వం (State Government) స్థానచ‌ల‌నం క‌ల్పించింది. ముఖ్యంగా సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా హైకోర్టు (High Court) ఆదేశాలను పక్కనపెట్టిన కారణంగా తీవ్ర విమర్శలకు గురై ప్ర‌స్తుత బాధ్య‌తను కోల్పోయారు. ఆయ‌న్ను ట్రాన్స్‌పోర్టు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ (Transport, Roads and Building department)కు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఇదే క్ర‌మంలో అనేకమంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచల‌నం క‌ల్పించిన సర్కారు కొత్త బాధ్యతలను అప్ప‌గించింది. ఈమేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించార‌ని… సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన...
error: Content is protected !!