Sarkar Live

State

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు
State, warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు

Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది.  రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.  జ‌న‌వ‌రి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీల‌క‌మైన ఘ‌ట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో  వెల్లడించారు....
Mee Seva | మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి మరిన్ని సేవలు
State, Hyderabad

Mee Seva | మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి మరిన్ని సేవలు

మీ సేవ కేంద్రాల్లో (Mee Seva Centers) మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ విలువ సర్టిఫికేట్ వంటి సేవలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Duddilla Sridhar babu) సోమవారం అధికారికంగా ప్రారంభించారు. దీనిపై సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన తాజా సేవల తీరును పరిశీలించారు. ఇకపై మ్యారేజీ రిజిస్ట్రేష‌న్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిర‌గాల్సిన అవసరం ఉండదు. ఇకపై దరఖాస్తుదారులు స్లాట్ బుకింగ్ ద్వారా ముందుగానే అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. పెళ్లి తాలూకు ఫొటోలు, చిరునామా, వయస్సు రుజువులతో పాటు అవసరమైన పత్రాలు సమర్పిస్తే, ధ్రువీకరణ అనంతరం సర్టిఫికేట్‌ను ప్రత్యక్షంగా ఎస్ఆర్వో కార్యాలయంలో పొందవచ్చు. Mee Seva : భూముల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్ కూడా.. భూముల తాజా మార్కెట్ విలువ తెలుసుకోవాలంటే ఇక చాలా సులువు. మీ సేవ కేంద్రం (Mee seva ...
Raja Singh | బిజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా?
State, Hyderabad

Raja Singh | బిజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా?

తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో అంత‌ర్గ‌త విభేదాలు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి ఎంపిక‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh ) మరోసారి సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి రాజాసింగ్ ప‌లు విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావును అధిష్టానం ఖరారు చేసిన విష‌యం తెలిసిందే.. ఈ విష‌యంపై ​గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంద‌ని, రాష్ట్ర అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాల‌ని, అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమిస్తుంటే పార్టీకి నష్టం వ‌స్తుంద‌ని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహి...
పసుపుబోర్డు ప్రారంభం..  రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్‌ షా  Turmeric Board
Nizamabad

పసుపుబోర్డు ప్రారంభం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్‌ షా Turmeric Board

National Turmeric Board Nizamabad | నిజామాబాద్‌ జిల్లా వాసుల నాలుగు దశాబ్దాల కల నేటితో నెరవేరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు (Turmeric Board ) జాతీయ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. " జాతీయ పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులకు పెద్ద బహుమతిని ప్రధాని మోదీ అందించారని తెలిపారు. టెర్మరిక్ బోర్డు ద్వారా ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, నిజామాబాద్‌ పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అమిత్‌ షా స్పష్టం చేశారు. పురాతన కాలం నుంచి భారత జీవనవిధానంలో పసుపు భాగమైందని, ఇది యాంటీ సెప్టిక్‌, యాంటీవైరల్‌ గుణాలు కలిగి ఉందని అమిత్ షా గుర్తుచ...
Hyderabad | టీవీ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి
Crime, Hyderabad

Hyderabad | టీవీ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి

Hyderabad News | ప్రముఖ తెలుగు టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్ హౌస్ లో నివాసముంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో సమాచారం అందింది. ఈమేరకు అక్కడికి వెళ్లి చూడగా.. స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్‌తో కలిసి పార్సిగుట్టలోని వైఎస్ఆర్‌ పార్కు సమీపంలో నివాసమున్న స్వేచ్ఛ.. గత నాలుగేళ్లుగా కూతురు (14)తో కలిసి వేరుగా ఉంటున్నారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొన...
error: Content is protected !!