Sarkar Live

కలెక్టర్ పట్టుదల.. రియల్టర్ల కుతంత్రాలు!

కీర్తినగర్ హౌజింగ్ బోర్డు సర్వేను అడ్డుకునేందుకు ‘విశ్వప్రయత్నాలు’ Housing Board Land Survey | గీసుగొండ మండలంలోని కీర్తినగర్ (Keerthi nagar) హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసిన

Housing Board Land Survey

కీర్తినగర్ హౌజింగ్ బోర్డు సర్వేను అడ్డుకునేందుకు ‘విశ్వప్రయత్నాలు’

Housing Board Land Survey | గీసుగొండ మండలంలోని కీర్తినగర్ (Keerthi nagar) హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు రియల్టర్లు, దానిని చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుంటే, మరోవైపు రాజకీయ పలుకుబడితో సర్వేను అడ్డుకునేందుకు రియల్టర్లు ‘విశ్వప్రయత్నాలు’ చేస్తున్నారు. ​అధికారుల ఆదేశాలకు, రాజకీయ ఒత్తిళ్లకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలుపు ఎవరిది? సర్వే సజావుగా సాగుతుందా లేక రియల్టర్ల వ్యూహమే పారుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

​రాజకీయ ఒత్తిడితో పావులు..

​హౌజింగ్ బోర్డుకు చెందిన ఖరీదైన భూమిలో హద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవగా, ఒక ప్రముఖ రియల్టర్ దానిని అడ్డుకొనేందుకు చక్రం తిప్పుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులను తోడు చేసుకొని, ఏకంగా మంత్రి మరియు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల ద్వారా సర్వేను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో కలకలం రేపుతున్నాయి.

​కలెక్టర్ సీరియస్.. అధికారులు ‘మీనమేషాలు’!

​ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. హౌజింగ్ బోర్డు భూమి ఒక్క అంగుళం కూడా పక్కదారి పట్టకూడదని, తక్షణమే సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఒకవైపు కలెక్టర్ ఆదేశాలు.. మరోవైపు రియల్టర్ లు,రాజకీయ నేతల ఒత్తిడి మధ్య నలుగుతున్న కింది స్థాయి అధికారులు మాత్రం సర్వే నిర్వహణలో ‘మీనమేషాలు’ లెక్కిస్తున్నారు. ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తూ సర్వేను వాయిదా వేస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Housing Board Land Survey : ​ఎవరి వ్యూహం ఫలిస్తుంది?

​ప్రస్తుతం కీర్తినగర్‌ హౌజింగ్ బోర్డు భూమి పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది.
కలెక్టర్ పట్టుదల: నిబంధనల ప్రకారం సర్వే పూర్తి చేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని వరంగల్ కలెక్టర్ గట్టి పట్టుదలతో ఉన్నారు.

​రియల్టర్ వ్యూహం: రాజకీయ అండదండలతో, తాయిలాలతో సర్వేను అటకెక్కించి భూమిని చేజిక్కించుకోవాలని అశోక హోటల్ కేంద్రంగా వ్యూహాలు పన్నుతున్నారు.

గీసుగొండ మండలంలోని కీర్తినగర్​ హౌజింగ్ బోర్డు భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు కోరుతున్నారు. కలెక్టర్ గారి ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటిస్తారా? లేక రియల్టర్ రాజకీయ వ్యూహాలకు తలొగ్గుతారా అనేది త్వరలోనే తేలిపోనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?