Sarkar Live

గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి: ప్రయాణికుల డిమాండ్

వరంగల్ నగరంలోని కీలక ప్రాంతమైన గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ జంక్షన్ నుండి రాకపోకలు సాగిస్తుండగా, కనీసం నిలబడటానికి నీడ లేక నానా అవస్థలు

వరంగల్ నగరంలోని కీలక ప్రాంతమైన గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ జంక్షన్ నుండి రాకపోకలు సాగిస్తుండగా, కనీసం నిలబడటానికి నీడ లేక నానా అవస్థలు పడుతున్నారు.

​ప్రయాణికుల ప్రధాన సమస్యలు..

సరైన షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు మండుతున్న ఎండలో, వర్షంలో రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పాఠశాల విద్యార్థులు గంటల తరబడి నిలబడలేక ఇబ్బంది పడుతున్నారు.

బస్ స్టాప్ నిర్దేశిత ప్రాంతంలో షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మీదకు వచ్చి నిలబడుతున్నారు. దీనివల్ల అటుగా వచ్చే వాహనదారులకు ఆటంకం కలగడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి సమయాల్లో వెలుతురు, కూర్చునే సదుపాయం లేక మహిళా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

​ఆర్టీసీ అధికారులకు విన్నపం..

​వరంగల్ ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ (DM) ఈ విషయంపై వెంటనే స్పందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

​”చాలా కాలంగా ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తాత్కాలికంగానైనా షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది,” అని స్థానిక ప్రయాణికులు పేర్కొంటున్నారు.

​నగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, నిత్యం రద్దీగా ఉండే గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?