Sarkar Live

Privacy Policy

వరంగల్ ప్రగతి రథ సారథి: కలెక్టర్ సత్య శారద మార్క్ పాలన!
State

వరంగల్ ప్రగతి రథ సారథి: కలెక్టర్ సత్య శారద మార్క్ పాలన!

పాలన అంటే కేవలం సంతకాలు, సమీక్షలు మాత్రమే కాదు.. ప్రజల గుండె చప్పుడిని వినడం అని నిరూపిస్తున్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పై "సర్కార్ లైవ్" ప్రత్యేక కథనం.బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే జిల్లాలో తనదైన ముద్ర వేస్తూ, జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు. ​ప్రజల ముంగిటకే పాలన: 'ప్రజావాణి'కి కొత్త ఊపిరి ​సాధారణంగా కలెక్టరేట్ అంటే సామాన్యుడికి ఒక భయం ఉంటుంది. కానీ సత్య శారద గారు ఆ పరిస్థితిని మార్చేశారు. ప్రతి వారం నిర్వహించే 'ప్రజావాణి'లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల గోడును ఆమె స్వయంగా వింటున్నారు. ఫిర్యాదులను కేవలం స్వీకరించి పక్కన పెట్టకుండా, అక్కడికక్కడే అధికారులను ఆదేశించి సమస్య పరిష్కారానికి మార్గం చూపుతున్నారు. ​ విద్యా, వైద్య రంగాల్లో క్షేత్రస్థాయి మార్పులు ​జిల్లాలో విద్య మరియు వైద్యం మెరుగుపడటమే లక్ష్యంగా ఆమె అకస్మిక ...
రైతు వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ సమరభేరి: వరంగల్‌లో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభం
warangal

రైతు వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ సమరభేరి: వరంగల్‌లో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రోషిని ఆదేశాలతో  ​వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దిలీప్ రాజ్ నేతృత్వంలో వరంగల్ పోచంమైదాన్ సెంటర్ లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.దేశవ్యాప్తంగా రైతులను నష్టపరిచే విధంగా మోడీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. ​రైతులకు న్యాయం జరిగే వరకు, వారి హక్కులను కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ మరియు యువజన విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా రైతుల గొంతును ప్రభుత్వానికి వినిపిస్తామని...
Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!
Crime

Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!

ఒక తాగుబోతు డ్రైవర్ సృష్టించిన బీభత్సం (Road Accident) మూడు కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది. సాగర్ రోడ్డులోని హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. భవిష్యత్తుపై ఎంతో ఆశలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వంద మీటర్ల మేర ఈడ్చుకెళ్లి.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వస్తున్నాడు. హస్తినాపురం వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయిన కారు మొదట ఒక ద్విచక్ర వాహనాన్ని, ఆపై రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మరో యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బాధితులు కారు కింద చిక్కుకోగా, వారిని సుమారు 100 మీటర్ల మేర అలాగే ఈడ్చుకెళ్లింది. చివరకు కారు పల్టీ కొట్టడంతో వాహనం ఆగిపోయింది. Road Accident : మృతుల వి...
అక్రమ మట్టి రవాణాపై పోలీసుల మెరుపు దాడి: జేసీబీ, 6 ట్రాక్టర్లు సీజ్
warangal

అక్రమ మట్టి రవాణాపై పోలీసుల మెరుపు దాడి: జేసీబీ, 6 ట్రాక్టర్లు సీజ్

గీసుగొండ మండల పరిధిలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై గీసుగొండ పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఒక జేసీబీతో పాటు ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గీసుగొండ సి ఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ..​చంద్రయ్యపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి నుండి కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, నిందితులపై కేసులు నమోదు చేశారు. ​నిందితుల వివరాలు: ​ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి: ​గండికోట సతీష్ (మనుగొండ) ​గాడు...
సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రమేనా?
Special Stories

సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రమేనా?

​32 ఏసీకేల  బియ్యం పెండింగ్.. ‘ఉప్పరపల్లి’ మిల్లుపై జోరుగా ప్రచారం! వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలోని సాయిరాం బిన్నీ రైస్ మిల్లు  వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో (CMR) ఈ మిల్లు భారీగా వెనుకబడి ఉండటంతో పాటు, అక్కడ ఉండాల్సిన ధాన్యం నిల్వలు మాయమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​ 32 ఏసీకేలకు సరిపడా ధాన్యం భద్రమేనా! ​విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ మిల్లులో సుమారు 32 ఏసీకేల (ACKs) మేర బియ్యం నిల్వలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సకాలంలో ఎఫ్.సి.ఐ (FCI)కి,పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అసలు సదరు మిల్లులో ధాన్యం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ​రూ. 3 కోట్ల ధాన్యంలో సగ...
error: Content is protected !!