ఆదిలాబాద్ ‘ఎయిర్పోర్ట్’ .. జూన్ 2న శంకుస్థాపన! పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు Adilabad
Revanth Reddy Adilabad Visit | రాజకీయాల్లో విశ్వాసం, విలువలే పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉద్ఘాటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తూనే, గత ప్రభుత్వానికి భిన్నంగా తాము అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలను వివరించారు.
పీపుల్స్ మార్చ్ స్ఫూర్తితోనే అధికారం
నాడు పిప్రి గడ్డ నుంచే భట్టి విక్రమార్క 1400 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అందుకే ఆదిలాబాద్ జిల్లాపై తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆదిలాబాద్ ప్రజలు కేవలం అమాయకులు మాత్రమే కాదు, నిరంకుశత్వంపై పోరాడిన వీరులని ...




