Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఆర్టీసీ చర్చలు విఫలం: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె!
Hyderabad

ఆర్టీసీ చర్చలు విఫలం: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె!

●డిపోలకే పరిమితం కానున్న బస్సులు.. స్తంభించనున్న ప్రజారవాణా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈరోజు అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ​చర్చలు కేవలం కాలయాపనే: జేఏసీ విమర్శ ​సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించిందని కార్మిక నేతలు మండిపడ్డారు. చివరి నిమిషంలో చర్చల పేరుతో పిలిచి కాలయాపన చేశారే తప్ప, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని వారు ఆరోపించారు. ​"మేము కొత్త డిమాండ్లు ఏవీ కోరలేదు. అన్నీ పాత డిమాండ్లే. ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చలు అనడం సరైంది కాదు. మా సమస్యలపై స్పష్టమైన హామీ లభించలేదు."ఆర్టీసీ JAC ​ప్రధాన డిమాండ్లు ఇవ...
ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు హర్షణీయం: TRUS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు
Hyderabad

ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు హర్షణీయం: TRUS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు

●675 అమరవీరుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలి ​●250 గజాల ఇళ్ల స్థలం, సంక్షేమ బోర్డు కోసం పట్టు ●పోలీస్ శాఖ రికార్డు ప్రకారం కేసులు ఉన్న వారికి కూడా న్యాయం చేయాలి ●తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు డిమాండ్ ​తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి హర్షం వ్యక్తం చేసింది.కె. కేశవరావు చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించడం శుభపరిణామమని TRUS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు అన్నారు.​ఈ కమిటీలో ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాములు నాయక్ వంటి నేతలను చేర్చడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ​అమరవీరుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ​ఈ సందర్భంగా గుర్రం రఘు...
వరంగల్‌లో భారీగా పట్టుబడ్డ ‘హాష్ ఆయిల్’: రూ. 2.50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Crime

వరంగల్‌లో భారీగా పట్టుబడ్డ ‘హాష్ ఆయిల్’: రూ. 2.50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. చరిత్రలో నిలిచిపోయేలా తొలిసారిగా సుమారు రూ. 2 కోట్ల 50 లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను (గంజాయి నూనె) స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. వరంగల్ డ్రగ్ కంట్రోల్ టీం, క్యాట్ పార్టీ మరియు ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ​అరెస్ట్ అయిన నిందితులు.. ​హంటల్ సన్ను (23) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా (ప్రధాన నిందితుడు) ​హంటల్ సన్యాసి (23) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా ​కండెల చిన్నబాబు (56) – అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ​కృష్ణ హంటల్ (56) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా  మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ​కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ​పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ...
మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన
warangal

మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన

​●కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమగ్ర విచారణ.. NDSA మార్గదర్శకాలతోనే ముందుకు ​●లోతుగా పరిశీలన... సాంకేతిక పరీక్షల సమీక్ష కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సోమవారం మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. కుంగిన పిల్లర్ర్స్ (స్తంభాల) వద్ద జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను స్వయంగా పరిశీలించి, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​లోతుగా పరిశీలన.. సాంకేతిక పరీక్షల సమీక్ష ​బ్యారేజీ వద్ద పిల్లర్స్ 20, 21, 22 లో బోర్ రిగ్స్ ద్వారా జరుగుతున్న శాంపిల్స్ సేకరణను ముఖ్యమంత్రి నిశితంగా గమనించారు. దాదాపు 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) కు పంపనున్నట్లు అధికారుల...
జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha
State, Karimnagar

జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha

KCR Jagtial Sabha | తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి జగిత్యాల వేదికవుతోంది. కాంగ్రెస్‌ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు, ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాల మినీ స్టేడియంలో సమరశంఖం పూరించబోతున్నారు. ఐదు దశాబ్దాల క్రితం రైతుకూలీల జైత్రయాత్రతో జంగ్ నడిపిన ఈ గడ్డపై, ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమైంది. సభా వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జగిత్యాల ఖిల్లా: కలిసొచ్చిన సెంటిమెంట్ జగిత్యాల గడ్డకు మరియు కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ మినీ స్టేడియంలో సభ (KCR Jagtial Sabha) జరిగినప్పుడల్లా ఉద్యమంలో లేదా రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు వచ్చాయి. 2001: పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి సభతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. 2003: ధర్మపురి సింహగర్జనతో గోదావరి పుష్కరాలకు న...
error: Content is protected !!