Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR
Special Stories

సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR

​Sarkar Live Exclusive | గత కొన్నిరోజుల క్రితం ​సీఎంఆర్ (CMR - కస్టమ్ మిల్లింగ్ రైస్ ) గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించి గడువును పెంచింది. అయినప్పటికీ కొంతమంది మిల్లర్ లు మాత్రం ప్రభుత్వానికి పెట్టాల్సిన సీఎంఆర్ ను మాత్రం పూర్తిచేయలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది మిల్లర్ లు ఇప్పటికే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించడంవల్లే సీఎంఆర్ పూర్తిచేయలేకపోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా బొల్లికుంట రెవెన్యూ శివారులోని సాయిరాం రైస్ మిల్లు సీఎంఆర్ (Sairam Rice Mill CMR) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.2025-26ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ మిల్లర్ ప్రభుత్వానికి 47 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 23 ఏసికేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా 24 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా,అసలు 24 ఏసికే లకు సరిపడా ధాన్యం మిల్లులో ఉం...
కలెక్టర్ పట్టుదల.. రియల్టర్ల కుతంత్రాలు!
Special Stories

కలెక్టర్ పట్టుదల.. రియల్టర్ల కుతంత్రాలు!

కీర్తినగర్ హౌజింగ్ బోర్డు సర్వేను అడ్డుకునేందుకు 'విశ్వప్రయత్నాలు' Housing Board Land Survey | గీసుగొండ మండలంలోని కీర్తినగర్ (Keerthi nagar) హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు రియల్టర్లు, దానిని చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుంటే, మరోవైపు రాజకీయ పలుకుబడితో సర్వేను అడ్డుకునేందుకు రియల్టర్లు 'విశ్వప్రయత్నాలు' చేస్తున్నారు. ​అధికారుల ఆదేశాలకు, రాజకీయ ఒత్తిళ్లకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలుపు ఎవరిది? సర్వే సజావుగా సాగుతుందా లేక రియల్టర్ల వ్యూహమే పారుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ​రాజకీయ ఒత్తిడితో పావులు.. ​హౌజింగ్ బోర్డుకు చెందిన ఖరీదైన భూమిలో హద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవగా, ఒక ప్రముఖ రియల్టర్ దానిన...
సాయి క్రిష్ణ ధాన్యం లీలలు.. రికార్డుల్లో నిల్వ.. మిల్లులో ఖాళీ!
Special Stories

సాయి క్రిష్ణ ధాన్యం లీలలు.. రికార్డుల్లో నిల్వ.. మిల్లులో ఖాళీ!

పౌరసరఫరాల రికార్డులకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ తేడా? Sai Krishna Rice Mill Grain Scam | పౌరసరఫరాల శాఖ రికార్డుల్లో వందల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నా, మిల్లులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా నందనంలోని సాయి కృష్ణ రైస్ మిల్లుపై ఇప్పుడు అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. ​రికార్డుల్లో ‘నిల్వ’… మిల్లులో ‘ఖాళీ’! ​పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 15 ఏసికేలు (ACKs) ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధాన్యం నిల్వలు మిల్లుకు రాకుండానే రికార్డులు సృష్టించారా? లేదా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అక్రమ మార్గాల...
RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం
Crime

RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్.. 90 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంకు తరలింపు! RTC Strike | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బోలా శంకర్ గౌడ్ () , గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆవేదనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిరసన ప్రదర్శన జరుగుతున్న స...
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి
Crime

తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు చోటుచేసుకున్నాయి. ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ (డీజీ) హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులకు ఈ పదోన్నతులు లభించాయి.డీజీలుగా ప్రమోషన్ అందుకున్న వారిలో వీవీ శ్రీనివాసరావు, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్ కుమార్  ఉన్నారు....
error: Content is protected !!