Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?
జిల్లాలోని ఉప్పరపల్లిలో గల సాయిరాం రైస్ మిల్లులోని ధాన్యం నిల్వల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం వచ్చిన ధాన్యం నిల్వలలో భారీ తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 32 ఏసీకేల (ACKs) ధాన్యంలో సగానికి పైగా మాయమైనట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై బుధవారం"సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో సర్కారు ధాన్యం భద్రమేనా" అనే కథనాన్ని సర్కార్ లైవ్ ప్రచురించింది. అయితే ఈ మిల్లులోని ధాన్యం నిల్వల లెక్కలు తేల్చేందుకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి రంగంలోకి దిగుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది..
Rice Mill Scam : అసలేం జరుగుతోంది?
గత కొంతకాలంగా ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, నివేదికల్లో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు సగానికి పైగా ధాన్యం నిల్వలు మిల్లులో భౌతికంగా లేవని, వాటిని పక్కదారి పట్టి...




