Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్‌లో స్వీయ విధ్వంసక రాజకీయం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ముప్పేట దాడి.. సిఎం రేవంత్ వర్గమే టార్గెట్ చేసిందా?
Special Stories

కాంగ్రెస్‌లో స్వీయ విధ్వంసక రాజకీయం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ముప్పేట దాడి.. సిఎం రేవంత్ వర్గమే టార్గెట్ చేసిందా?

Telangana Politics - Congress Internal War | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress party)ని కూలదోయడానికి ప్రత్యర్థుల అవసరం లేనట్లే కనిపిస్తోంది. ప్రస్తుత పదవీకాలం మధ్యలోనే, పార్టీ అంతర్గత నాయకత్వం స్వీయ విధ్వంసక రాజకీయాల్లో ఆరితేరినట్లు స్పష్టమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయకర్తగా సాగుతున్న బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) చుట్టూ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం తెరపైకి వచ్చింది. ఒక ప్రముఖ ఛానల్‌లో ఆయనను "అసమర్థుడిగా" చిత్రీకరిస్తూ వచ్చిన కథనాలు గాంధీభవన్‌తో పాటు లండన్, ఢిల్లీ వేదికల వరకు పెను కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ఛానల్‌లోనే వ్యతిరేక వార్తలు! సాధారణంగా ఒక టీవీ ఛానెల్‌లో ఇలాంటి వ్యతిరేక కథనం రావడం పెద్ద విషయమేమీ కానప్పటికీ, సదరు ఛానెల్ యజమాని ముఖ్యమంత్...
కాజీపేటలో ‘రైళ్ల’ తయారీ షురూ: పూర్తి కావచ్చిన మెగా యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు!
State, warangal

కాజీపేటలో ‘రైళ్ల’ తయారీ షురూ: పూర్తి కావచ్చిన మెగా యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు!

Kazipet Railway Unit | తెలంగాణ రవాణా రంగ ముఖచిత్రాన్ని మార్చబోయే కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ) పనులు దాదాపు పూర్తి కావచ్చాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. త్వరలోనే ఈ యూనిట్‌లో అత్యాధునిక 'ఇంటర్‌ సిటీ రైళ్ల' తయారీ ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ ప్రగతిపై నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక వివరాలను పంచుకున్నారు. ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు.. స్వల్ప దూర ప్రయాణాలకు వరం! రానున్న ఐదేళ్ల కాలంలో కాజీపేట యూనిట్ నుండి ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప దూర ప్రయాణాల (Short-distance travel) కోసం ఈ రైళ్లను పెద్ద ఎత్తున వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా వ...
​RTO Corruption | ఆర్టీవో గారి ‘రవాణా’ లీలలు: ఆ ఒక్క వికెట్ పడితే ఖేల్ ఖతం!
Special Stories

​RTO Corruption | ఆర్టీవో గారి ‘రవాణా’ లీలలు: ఆ ఒక్క వికెట్ పడితే ఖేల్ ఖతం!

​అందినకాడికి దండుకున్న ‘ఆ’ అధికారి ​గత ప్రభుత్వంలో పోస్టింగ్‌లు, బదిలీలతో భారీగానే వెనకేసినట్లు ఆరోపణలు ? ​తోటి అధికారులతో పాటు వాహనదారులకూ వాత.. ​‘ఆ ఒక్క వికెట్ పడితే ఖేల్ ఖతం’… రవాణా శాఖలో జోరుగా సెటైర్లు! RTO Corruption | "వామ్మో… రామచంద్రా… ఆ రవాణా శాఖ అధికారి లీలలు మామూలుగా ఉండేవి కావాయ్యో !" అంటూ ఇప్పుడు సదరు శాఖలో ఉద్యోగులు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి గారి అవినీతి పురాణం ఇప్పుడు రవాణా శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టింగ్‌ల దగ్గర నుంచి బదిలీల వరకు.. ప్రతి ఫైలుకూ ఓ రేటు కట్టి గట్టిగానే దండుకున్నట్లు శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది. ​RTO Corruption : జోన్‌ను గుప్పిట్లో పెట్టుకుని… ​సదరు అధికారి గత ప్రభుత్వంలో ఓ కీలకమైన జోన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని, సమాంతర సామ్రాజ్యాన్ని నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. నిబ...
Rains | అన్నదాతకు కన్నీటి ‘వర్షం’: రాష్ట్రవ్యాప్తంగా తడిసి ముద్దయిన ధాన్యం.. కొట్టుకుపోయిన వడ్ల కుప్పలు!
State

Rains | అన్నదాతకు కన్నీటి ‘వర్షం’: రాష్ట్రవ్యాప్తంగా తడిసి ముద్దయిన ధాన్యం.. కొట్టుకుపోయిన వడ్ల కుప్పలు!

తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం (Unseasonal Rains) అన్నదాతలను అతలాకుతలం చేసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చినప్పటికీ, రైతన్నలకు మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ (IKP) కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన వరి, మక్క ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి మార్కెట్లలో ధాన్యపు రాశులు నదిలా.. జగిత్యాల జిల్లా మెట్‍పల్లి వ్యవసాయ మార్కెట్‍లో ఆరబోసిన వడ్లు, మక్కలు నిన్నటి వర్షానికి (Rains) పూర్తిగా తడిసిపోయాయి. పెద్దపల్లి మార్కెట్ యార్డులో ధాన్యం వర...
​ఇంటి స్థలం గొడవ: అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం
Crime

​ఇంటి స్థలం గొడవ: అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం

ఇంటి స్థలం కొలతల విషయంలో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారి, ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి దారితీసిన ఘటన గీసుగొండ మండల పరిధిలోని దస్రు నాయక్ తండా (మంగళ తండా) లో చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ​అప్పుల బాధతో స్థలం విక్రయం.. ​మంగళ తండాకు చెందిన కేలోతు కవిత, ఆమె భర్త శ్రీధర్ అప్పుల బాధలు తాళలేక తమకు ఉన్న ఇల్లు, ఇంటి స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కవిత ఆడబిడ్డ అయిన గూగులోతు విజయ (భువనగిరి), మరియు జరుపుల మంగమ్మ (మంగళ తండా) లు ఆ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 24వ తేదీన గ్రామ పెద్దల సమక్షంలో ఒక గుంట స్థలానికి రూ. 2,60,000 చొప్పున ధర నిర్ణయించుకుని, లక్ష రూపాయలను అడ్వాన్స్‌గా కూడా చెల్లించారు. ​కొలతల వేళ వివాదం – చెప్పులతో దాడి.. ​మరుసటి రోజు (మే 25న)...
error: Content is protected !!