నా మిల్లు.. నా ఇష్టం! ఫున్నెల్లో సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ధాన్యం’ దందా? – Rice Mill Scam
2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి భారీగా ధాన్యం గోల్ మాల్
సుమారు 10 ఏసికేలకు పైగా ప్రభుత్వ వడ్లు గల్లంతైనట్లు ఆరోపణలు
Punnel Village Rice Mill Fraud : "నిబంధనలు నాకు వర్తించవు.. నా ఇష్టారాజ్యమే ఇక్కడ శాసనం" అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఫున్నేల్లోని సత్యనారాయణ స్వామి రైస్ మిల్లు యజమాని. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వ ధాన్యం సేకరణలో భారీ గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ ప్రభుత్వానికి చెందిన వడ్లు మాయమవ్వడం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది.
ఏకంగా 10 ఏసీకేలకు పైగా (ACKs) వడ్లు గల్లంతు!
ప్రభుత్వ లెక్కల ప్రకారం సివిల్ సప్లైస్ విభాగం నుంచి మిల్లుకు అప్పగించిన ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 10 ఏసీకేలకు (Ack) సంబంధించిన వడ్లు మిల్లు నుండి 'మాయం' అయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ మార్కెట్ ధర ప్రకారం కోటికి...




