Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
హౌజింగ్ బోర్డు భూములను రక్షించిన కలెక్టర్
Special Stories

హౌజింగ్ బోర్డు భూములను రక్షించిన కలెక్టర్

కబ్జా దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారి మంగళవారం హద్దులు కేటాయించిన అధికారులు ​Housing Board Land Survey | ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే.. ప్రభుత్వ భూమిపై కన్నేస్తే సహించేది లేదని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద (Warangal Collector Satya Sharada) చేతల్లో చూపిస్తున్నారు. దశాబ్దాలుగా ఆక్రమణల చెరలో చిక్కుకున్న, కబ్జాదారుల కన్ను పడ్డ విలువైన హౌజింగ్ బోర్డు భూములను రక్షించి జిల్లా వాసుల నీరాజనాలు అందుకుంటున్నారు. ​మంగళవారం: ఆక్రమణదారులకు 'అమంగళం' ​గత కొంతకాలంగా వివాదస్పదంగా మారిన కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించారు. కలెక్టర్ సత్య శారద సీరియస్ గా తీసుకోవడంతో అటు కొంతమంది అధికారులు, ఇటు కబ్జాదారులు ఆటలు సాగలేదు.​వేగవంతమైన నిర్ణయం: వరంగల్ జిల్లా గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని కీర్తినగర్ హౌజింగ...
ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations
Special Stories

ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations

​వచ్చిన కాలం నాలుగు రోజులే.. ఉన్నప్పుడే వెనకేసుకోవాలన్నదే లక్ష్యం! నిబంధనలు గాలికి.. చెరువు శిఖం భూములకు కూడా రిజిస్ట్రేషన్లు! కాసులు కురిపిస్తున్న ‘నాన్ లేఅవుట్’ వెంచర్లు.. చర్చనీయాంశంగా మారిన అధికారి తీరు. ​Illegal Registrations in warangal | ఆ కుర్చీకి ఉన్న పవర్ అటువంటిదో.. లేక ఆ అధికారికి ఉన్న 'అండదండలు' అటువంటివో తెలియదు కానీ, అక్కడ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. నిలువునా అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ సదరు ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సాగించిన 'రిజిస్ట్రేషన్ల పర్వం' ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ​అంతా 'ఇంచార్జి' మాయ! ​శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల కంటే, ఇంచార్జిలుగా బాధ్యతలు చేపట్టిన వారే ఎక్కువ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "వచ్చిన కాలం నాలుగు రోజులు.. ఉన్నప్పుడే గట్టిగా వెనకేసుకోవాలి" అన...
ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!
Special Stories

ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!

​వరంగల్ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, మరికొందరు చరిత్రలో నిలిచిపోతారు. కానీ, నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) తన నిబద్ధతతో, అలుపెరగని పోరాట పటిమతో వరంగల్ పశ్చిమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న తీరు అమోఘం. ​ప్రజా విజయం.. ఒక తపస్సు ఫలితం ​రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమిలోనూ వెన్నుచూపక, దశాబ్ద కాలం పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నాయినికే చెల్లింది. అధికారం లేనప్పుడు కూడా ఆయన సాగించిన ప్రజా పోరాటాలే, నేడు ఆయనను అసెంబ్లీలో వరంగల్ గళంగా నిలబెట్టాయి. ​అభివృద్ధి పథంలో వరంగల్ పశ్చిమ : నాయిని మార్క్ పాలన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (Warangal West )లోని ప్రతి గల్లీలోనూ మౌలిక సదుపా...
అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement
Special Stories

అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement

ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంపై రైతుల ఆందోళన పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు ​ Grain procurement old method | రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్‌లైన్ ట్రక్ షీట్' విధానం రైతుల పాలిట శాపంగా మారింది. ఈ కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ​రైతుల ఆందోళనలకు ప్రధాన కారణాలు.. ​సాంకేతిక సమస్యలు: ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.సర్వర్ సమస్యల వల్ల ట్రక్ షీట్ల జనరేషన్ గంటల తరబడి నిలిచిపోతోంది. ​క్షేత్రస్థాయిలో ఇబ్బందులు: మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉండటంతో రైతులు ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ​కొనుగోళ్లలో జాప్యం: ఒకవైప...
రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’..  కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!
State

రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!

తెలంగాణ రాష్ట్ర సమితి (BRS Party) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభవేళ, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం భవిష్యత్ రాజకీయ పోరాటానికి దిశానిర్దేశం చేసింది. అనంతరం మీడియాలో మాట్లాడిన కేటీఆర్, అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీజేపీ ఎంపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు 'ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం' నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆగ్రహం: "తెలంగాణ అంటే పాకిస్థాన్ కాదు" పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మౌనం ఎందుకు?: "తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే అక్కడ ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా కూర్చున్నారు. ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అక్కడికక్కడే ని...
error: Content is protected !!